07-02-2025 Daily Current Affairs| ఏపీలో పాలను అత్యధికం గా ఉత్పత్తి చేసే జిల్లా ఏది?
శ్రీహరికోట నుండి గత నెలలో అనగా జనవరి లో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం పూర్తి సక్సెస్ కాలేదు…. ఇంగ్లాండ్ T20 లీగ్ అయిన ‘ది హండ్రెడ్’ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక జట్టును కొనుగోలు చేసింది…నదుల అనుసంధానం చేయడం ద్వారా 39.76 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించ వచ్చని తెలిపారు… ఇటువంటి మరిన్ని కరెంట్ ఎఫైర్స్ కోసం చదవండి….

07-02-2025 Daily Current Affairs
07-02-2025 Daily Current Affairs|ఏపీలో పాలను అత్యధికం గా ఉత్పత్తి చేసే జిల్లా ఏది?
నావిక్ వ్యవస్థ ఏర్పాటు లో పూర్తి గా పనిచేస్తున్న ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే
శ్రీహరికోట నుండి గత నెలలో అనగా జనవరి లో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం పూర్తి సక్సెస్ కాలేదు. దీనిలో ఉండే ఇంజన్ అనుకున్నట్టుగా పనిచేయక పోవడం తో భూమి చుట్టూ సబ్ ఆప్టిమల్ కక్ష్య లోనే తిరుగుతూ ఉండిపోయింది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (Indian Regional Navigation Satellite System-IRNSS) లో భాగం గా పలు ఉపగ్రహాలను ప్రయోగించారు. 07-02-2025 Daily Current Affairs
భారత దేశానికి స్వంత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS) ను ఏర్పాటు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. కార్గిల్ యుద్ధం జరుగుతున్నపుడు మన దేశం అమెరికన్ జీపీఎస్ (American GPS) కోసం ఆ దేశాన్ని సంప్రదించింది. అయితే ఈ వ్యవస్థ ను వాడుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు. దానితో స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ రూపకల్పన పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.
దానిలో భాగం గా ఇస్రో (ISRO) ‘నావిక్ కార్యక్రమం’ IRNSS ను 1999 లో ఏర్పాటు చేసింది. 2013 జూలై 1 వ తేదీన ఈ ప్రాజెక్టు లో మొదటి ఉపగ్రహమైన IRNSS-1A ని ప్రయోగించారు. ఆ తర్వాత వరుసగా ఇదే సీరీస్ లో ఇప్పటివరకూ 11 ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో 5 నావిక్ ఉపగ్రహాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండగా 6 ఉపగ్రహాలు మాత్రం పాక్షిక వైఫల్యం చెందాయని 2023 వ సంవత్సరపు వార్షిక నివేదికలో ఇస్రో (ISRO – Indian Space Research Organization) తెలియజేసింది.
INTEGRATED AGRI UNIVERSITY ఏర్పాటు కు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ సంబంధమైన యూనివర్సిటీలు అన్నిటినీ కలిపి ఒకే సమీకృత విశ్వవిద్యాలయం (Integrated University) ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వ్యవసాయం – ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, హార్టికల్చర్ – వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశువైద్య విద్య – శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, మత్స్య విద్యాలయం మొదలైన వాటిని ఒకే పరిధి లోనికి తీసుకువచ్చి సమీకృత సేవలు అందించేలా చేసే ప్రయత్నం జరుగుతోంది.
లేదంటే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాంతీయ (రీజినల్) విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆయా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లు, రిజిస్త్రార్ ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
నదుల అనుసంధానం పై కేంద్ర మంత్రి వివరణ (07-02-2025 Daily Current Affairs)
గోదావరి, కృష్ణా, కావేరి, మహానది మొదలైన నదులను అనుసంధానం చేయడం ద్వారా లక్షల హెక్టార్ల లో సాగు నీరు అందించవచ్చని కేంద్ర జలశక్తి శాఖా సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి లోక్ సభలో తెలిపారు. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా 39.76 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించ వచ్చని తెలిపారు. అంతే కాకుండా గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు గానూ 4,541 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు 1957 మెగావాట్ల జల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంటుందని శ్రీ రాజ్ భూషణ్ చౌదరి లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. ఈ నాలుగు నదుల అనుసంధాన ప్రక్రియ వలన ఒడిశా, ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పాల ఉత్పత్తి (07-02-2025 Daily Current Affairs)
రాష్ట్రం లో ఏటా 154 లక్షల మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. సహకార సంస్థలు, డైరీ ల ద్వారా కేవలం 28% పాల ఉత్పత్తి జరుగుతుండగా అసంఘటిత రంగం ద్వారా 76% వరకూ పాలు సేకరిస్తున్నారు. అత్యధికం గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజుకి 34 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. ఆవు పాలలో సగటు వెన్న శాతం 3-4 గా ఉంటే గేదె పాలలో వెన్నశాతం 7-10 శాతం ఉంటుంది.
AP లో ఇకపై SC, ST లకు సౌర విద్యుత్ ఉచితం
రాష్ట్రం లోని 200 యూనిట్లు వినియోగించుకొనే SC, SC కుటుంబాలకు ఇకపై సౌర విద్యుత్ ఉచితం గా ఇస్తారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రస్తుతం 200 యూనిట్ల విద్యుత్ ఎవరికైతే ఉచితం గా ఇస్తున్నారో ఆయా కుటుంబాలను గుర్తించి వారికి సోలార్ ప్యానల్ లను (సౌర పలకలను) ఉచితం గా అందజేస్తారు. 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలకు మొత్తం అయ్యే ఖర్చు లక్షా పదివేను వేల రూపాయలు. ఈ ఖర్చు లో కేంద్రం 60 వేల రూపాయలను రాయతీ గా ఇస్తుంది. మిగిలిన 55 వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. లబ్దిదారులు ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు. (07-02-2025 Daily Current Affairs)
ఈ 2 కిలో వాట్ల సామర్ధ్యం కలిగిన సౌర పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. లబ్ది దారులు 200 యూనిట్ల వరకూ వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ ను విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానిస్తారు. ఇలా ఈ ప్రాజెక్టు ద్వారా నెలకు 80 మిలియన్ యూనిట్లు లేదా 2,412 మెగా వాట్ల సౌర విద్యుత్ అందుబాటులోనికి వస్తుంది. మొదటి ఐదేళ్ళు సంబంధిత కాంట్రాక్టర్ నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తారు. ఆ తర్వాత 12 ఏళ్ళ పాటు డిస్కం లు సౌర పలకల పరిరక్షణ బాధ్యతను నిర్వహించ వలసి ఉంటుంది.
ఇంగ్లాండ్ T20 లీగ్ లో కొత్త జట్టునే కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.
ఇంగ్లాండ్ T20 లీగ్ అయిన ‘ది హండ్రెడ్’ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక జట్టును కొనుగోలు చేసింది. నార్తరన్ సూపర్ చార్జర్స్ (Northern Super Chargers) జట్టును సుమారు 1080 కోట్ల రూపాయలు ( 100 మిలియన్ గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) కి కొనేసింది. ఈ T20 లీగ్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇంతకు ముందే వివిధ జట్ల లో వాటాలు కొనుగోలు చేసాయి. ముంబయి ఇండియన్స్ ప్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్ (Oval Invincible) లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్ (Manchester Originals) జట్టులో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది.
Ind vs Eng మొదటి వన్డే లో భారత్ ఘనవిజయం (07-02-2025 Daily Current Affairs)
ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య 6 వ తేదీ గురువారం (06-02-2025) జరిగిన తొలి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్ల లో 248 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టులో బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు, బెతేల్ 64 బంతుల్లో 51 పరుగులు, సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు చేసారు. భారత్ బౌలింగ్ విభాగం లో రవీంద్ర జడేజా , హర్షిత్ రానా 3 వికెట్ల చొప్పున తీసారు. జడేజా (3/26), హర్షిత్ రానా (3/53) త్వరత్వరగా వికెట్లు తీయడం తో భారీ స్కోరు చేస్తుంది అనుకున్న ఇంగ్లాండ్ జట్టు 248 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. (07-02-2025 Daily Current Affairs)
బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు లో శుభ్ మన్ గిల్ 96 బంతుల్లో 87 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 59, అక్షర్ పటేల్ 47 బంతుల్లో 52 పరుగులు చేయడం తో భారత్ తన పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్ల లోనే ఛేదించింది. ఆరు వికెట్లు కోల్పోయి ఘనవిజయం సాధించింది. మూడు వన్డే ల సీరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలుచుకొని 1 – 0 ఆధిక్యం లో నిలిచింది. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా ఆరంగేట్రం చేసారు.