Social Media Trolls Killed Woman in AP| సోషల్ మీడియా అరాచకానికి మహిళ బలి
సోషల్ మీడియా ఆమె ప్రాణం తీసింది. ఇంటి పట్టా చేతికి అందిన వెంటనే ఆ మహిళ తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్త పరచింది. తనకు ఒక ఇంటిని ఇచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అదే ఆమె చేసిన తప్పు. అలా మాట్లాడటమే తన ప్రాణం మీదకు తీసుకు వస్తుంది అంటే ఒక క్షణం ఆలోచించి ఉండేదేమో. ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలను పెట్టుకొని అంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండేది కాదేమో.