INDvENG Third Test – మూడవ టెస్టు లో భారత్ ఘనవిజయం
నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది.