India’s Own AI Model|చౌక గా చంద్రయాన్ సక్సెస్ చేసాం – ఈ ఏడాది స్వంత AI మోడల్ విడుదల చేయలేమా ?

JEE Main 2025 Session-1 Results
India’s Own AI Model| చౌక గా చంద్రయాన్ సక్సెస్ చేసాం – ఈ ఏడాది స్వంత AI మోడల్ విడుదల చేయలేమా ?!
అతి చౌక గా చంద్రయాన్ ప్రయోగం విజయవంతం చేసిన భారత్ కి స్వంత ఏఐ మోడల్ తయారు చేసుకోవడం ఏమంత కష్టం కాబోదు. దేశం నలు చెరగులా కావలసినంత విజ్ఞానం అందుబాటులో ఉంది. ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఉన్నారు. కంప్యూటర్ నిపుణులు ఉన్నారు. సాఫ్ట్ వేర్ లతో సాము గరడీలు చేసే అద్భుతమైన పనివంతులు దేశం నిండా ఉన్నారు. కావలసింది ఒక్కటే.. వారందరినీ ఒక గూటి క్రిందకి తీసుకు వచ్చి ప్రపంచం నివ్వెరపోయే పని వారికి అప్పజెప్పడమే. India’s Own AI Model
సరిగ్గా ఈ పనినే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చైనా ఏఐ మోడల్ అతి తక్కువ ధరలో తయారయ్యింది. ఇక ఇప్పుడు మనదేశం వంతు వచ్చింది. ఏఐ మోడల్ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కాబట్టి త్వరలోనే స్వదేశీ ఏఐ మోడల్ త్వరలోనే ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలోనే స్వదేశీ ఏఐ మోడల్ ను ఆవిష్కరించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నామని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
స్వదేశీ ఏఐ మోడల్ ను తయారు చేయడానికి 18,693 GPU (గ్రూప్ ప్రాసెసింగ్ యూనిట్స్) ని వినియోగిస్తున్నారు. చాట్ జీపీటీ నాల్గవ వెర్షన్ ను తయారుచేయడానికి 25 వేల GPU జీపీయూలు అవసరం అయ్యాయి. చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఆర్ 1 మోడల్ ను కేవలం రెండు వేల జీపీయూ లతో తయారు చేసారు. India’s Own AI Model
మన దేశం లో ప్రస్తుతం 18,693 GPU లు అందుబాటు లో ఉన్నాయి. AI మోడల్ లను అభివృద్ధి చేయడానికి ఎంప్యానెల్డ్ బిడ్డర్ లు తమ వద్ద ఉన్న GPU లను ఉపయోగిస్తారు. ఈ బిడ్డర్ ల జాబితా లో జియో ప్లాట్ ఫార్మ్స్, టాటా కమ్యూనికేషన్స్, CMS కంప్యూటర్స్, E2E నెట్ వర్క్స్ , Yotta డేటా సర్వీసెస్ వంటివి ఉన్నాయి. వీరి వద్ద 18,693 జీపీయూ లు ఉండటం తో వాటిని ఉపయోగించి AI మోడల్ ను తయారు చేస్తారు.
ఓపెన్ ఏఐ తయారు చేసిన చాట్ జీపీటీ, మెటా సంస్థ కు చెందిన మెటా ఏఐ, గూగుల్ కు చెందిన జెమిని, చైనా కు చెందిన డీప్ సీక్ ఏఐ మోడల్ లకు ఏమాత్రం తీసిపోని రీతిలో స్వదేశీ AI చాట్ బాట్ తయారు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. స్వదేశీ AI మోడల్ అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. స్వదేశీ మోడళ్ళు తప్పనిసరిగా భారతీయ సంస్కృతీ బాషలపై సమగ్ర సమాచారాన్ని అందించేవి గా ఉండాలని కేంద్ర మంత్రి కోరారు.
సెమీ కండక్టర్ చిప్ ల ఎగుమతి పై అమెరికా నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఏఐ మోడల్ తయారు చేయడం అంత కష్టం కాబోదు అని అశ్వనీ వైష్ణవ్ అన్నారు. భారత దేశం ఇతర దేశాలతో ముఖ్యం గా అమెరికా వంటి దేశాలతో సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాలలో నమ్మదగిన దేశం గా ఉండటం వలన జీపీయూ వంటి వాటిపై అంతగా ప్రభావం ఉండబోదు అని ఆయన వివరించారు.