IPL 2025 Match Highlights| from match no-08 to match no-36|TATAIPL 2025
Match No-08, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 పోటీలలో సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నంబర్ 8 విశేషాలు చూద్దాం. చెన్నై లోని చేపాక్ స్టేడియం లో 16 ఏళ్ళు గా CSK పై గెలిచిన చరిత్ర RCB కి లేదు. కాని 6155 రోజుల నిరీక్షణ కు తెర దించుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరచి సేఎస్కె జట్టు ను వారి హోం గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ బ్యాట్స్ మన్ అందరూ రాణించడం తో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ పాటిదార్ అందరికంటే ఎక్కువగా 51 పరుగులు చేయగా సాల్ట్ 32 , కోహ్లీ 31, పదిక్కల్ 27 చొప్పున పరుగులు చేసారు. టిం డేవిడ్ చివరి ఓవర్ లో ౩ భారీ సిక్సర్లు కొట్టడం తో ఆర్సీబీ భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. చెన్నై జట్టులోని నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన CSK జట్టు ఆరంభం లోనే మూడు వికెట్ల ను కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపే త్రిపాఠీ, గైక్వాడ్, హుడా వికెట్ల ను కోల్పోయింది.హేజెల్ వుడ్ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసుకోవడం తో చెన్నై కోలుకోలేక పోయింది. తర్వాత బ్యాట్స్ మన్ కరణ్, దూబే, జడేజా, అశ్విన్ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. చివర్లో వచ్చిన ధోనీ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు కొట్టి చెన్నై ప్రేక్షకులను అలరించారు. CSK జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. హోం గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి పరాభవం తప్పలేదు. 16 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ చిదంబరం స్టేడియం లో చెన్నై ని ఓడించింది. ధోనీ మరీ లోయర్ ఆర్డర్ లో కాకుండా కొంచం ముందుగానే బ్యాటింగ్ కి వస్తే చెన్నై కనీసం పోటీ అయినా ఇచ్చి ఉండేదని సగటు CSK అభిమానులు వాపోతున్నారు. తర్వాతి మ్యాచ్ లలోనైనా ధోనీ తన ఆర్డర్ మార్చుకుంటారేమో చూద్దాం. తాజా స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
Match No-09, TATAIPL 2025
విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం. ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నంబర్ 9 వివరాలు చూద్దాం. ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది. MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తో GT మొదట బ్యాటింగ్ చేసింది. గుజరాత్ జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సుదర్శన్ 63 పరుగులు, బట్లర్ 39 పరుగులు, గిల్ 38 పరుగులు చేసారు. పాండ్యా రెండు వికెట్లు, బోల్ట్, చాహర్, రెహమాన్, రాజు ఒక్కొక్క వికెట్ చొప్పున వికెట్లు పడగొట్టారు. ముంబై బ్యాటింగ్ ఆరంభం లోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. ఈ వికెట్ ను సిరాజ్ తీసుకోవడం విశేషం. సూర్య కుమార్ యాదవ్ 4 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయం తో 48 పరుగులు చేసారు. తిలక్ వర్మ 39 పరుగులు చేసారు. ముంబై జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్లు నష్టపోయి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో గుజరాత్ టైటన్స్ ముంబై పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రబాడా, సాయి కిషోర్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు. తాజా స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
Match No-10, TATAIPL 2025
విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 10 విశేషాలు చూద్దాం. విశాఖపట్నం లోని వై ఎస్సార్ క్రికెట్ స్టేడియం లో సన్ రైజర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక రసవత్తరమైన పోరు జరిగింది. సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లోనైనా భారీ స్కోరు సాధించాలనుకున్న వారి కలలు నెరవేరలేదు. కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది సన్ రైజర్స్ జట్టు. ప్రధాన బ్యాట్స్ మన్ అందరూ విఫలం అయ్యారు. అనికేత్ వర్మ మాత్రమే రాణించాడు. 41 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 5 బౌండరీల సహాయం తో 74 పరుగులు చేసాడు. క్లాసెన్ 32 పరుగులు చేసారు. సన్ రైజర్స్ పతనాన్ని మిచెల్ స్టార్క్ శాసించాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ వెన్ను విరిచాడు. కుల్దీప్ యాదవ్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన క్యాపిటల్స్ జట్టు మొదటి నుండీ వికెట్లు నష్టపోకుండా స్థిరం గా బ్యాటింగ్ చేసింది. మెక్ గుర్క్, డుప్లెస్సీ మధ్య 81 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. మెక్ గుర్క్ 38 పరుగులు , డుప్లెస్సీ 50 పరుగులు చేసారు. కే ఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పోరెల్, స్టబ్స్ చివరి లాంచనాలను పూర్తి చేసారు. సన్ రైజర్స్ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్ల లోనే చేసి ఘన విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ కి వరుసగా రెండవ పరాజయం కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది వరుసగా రెండవ విజయం. తాజా క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
Match No-15, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్, విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ పోటీలలో నేడు అనగా ఏప్రిల్ మూడు, 2025 న జరిగిన మ్యాచ్ నెంబర్ 15 హైలైట్స్ మీ కోసం .కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. దానితో బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ మొదట్లో తడబడినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాణించడం తో 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెంకటేష్ అయ్యర్ అరవై పరుగులు, రఘు వంశీ 50 పరుగులు, రహానే 38 పరుగులు, సింగ్ 32 పరుగులు చేసారు. భారీ లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ ప్రారంభం నుండే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ దశ లోనూ కోలుకోలేక పోయింది. అందరికంటే ఎక్కువగా క్లాసెన్ 33 పరుగులు, మెండిస్ 27 పరుగులు, నితీష్ కుమార్ 19 పరుగులు, కమ్మిన్స్ 14 పరుగులు చేసారు. మొదట్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లను రెండో ఓవర్ లోనే కోల్పోవడం తో మిడిల్ ఆర్డర్ బాట్స్ మన్ కూడా సరిగ్గా పరుగులు సాధించ లేక పోయారు. దీనితో పదహారు పాయింట్ నాలుగు ఓవర్ల లో కేవలం నూట ఇరవై పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడా తో చానా విజయం సాధించింది. సన్ రైజర్స్ జట్టు కు ఇది వరుసగా మూడవ పరాజయం. గత ఏడాది సంచలనాలు సృష్టించిన ఈ జట్టు కనీసం నూట యాభై పరుగులు కూడా చేయలేక పోతోంది. వారి హోం గ్రౌండ్ లో జరగబోయే రెండు మ్యాచ్ లలో గెలిచి తిరిగి ఫాం లోనికి వస్తారని ఆశిద్దాం. క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
Match No-16, TATAIPL 2025
విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం. ఏప్రిల్ 4, 2025 న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 16 హైలెట్స్ ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలుచుకొని బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు ఆరంభం నుండే దూకుడు గా ఆడి భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు బలమైన పునాది వేసారు. మార్ష్ 60 పరుగులు, మార్క్ రాం 53 పరుగులు, బదోని 30 పరుగులు, మిల్లర్ 27 పరుగులు చేయడం తో లక్నో జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చక్కగా రాణించి 5 వికెట్లు తీసుకోవడం విశేషం. బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ప్రారంభం లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నమన్ దీర్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆడుకున్నారు. చివరి ఓవర్ వరకూ విజయం ఇరు జట్ల మధ్యా దోబూచులాడింది. 19 వ ఓవర్ శార్దూల్ ఠాకూర్, 20 వ ఓవర్ ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడం తో ముంబై విజయానికి అవసరమైన పరుగులు చేయలేక పోయింది. సూర్య కుమార్ యాదవ్ 67 పరుగులు, నమన్ దీర్ 46 పరుగులు, పాండ్యా 28 పరుగులు, తిలక్ వర్మ 25 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. ముంబై జట్టు 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి కేవలం 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. దిగ్వేష్ సింగ్ పొదుపు గా బౌలింగ్ చేయడం, ఇతర బౌలర్లు కూడా సమయోచితం గా బౌలింగ్ చేయడం తో ముంబై పరుగుల వేట లో వెనుక బడింది. దీనితో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పై విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ విజయం తో లక్నో జట్టు పాయింట్స్ టేబుల్ లో ముంబై కంటే ముందు స్థానానికి చేరుకుంది. ప్రతిరోజూ ఐపీఎల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
Match No-17, TATAIPL 2025
విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం. ఏప్రిల్ 5 వ తేదీ 2025 న చెన్నై లోని చిదంబరం స్టేడియం లో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 17 వివరాలు తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈ పోటీ జరిగింది. ముందుగా ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు లోని ప్రధాన బ్యాట్స్ మన్ అందరూ బాగా ఆడటం తో ఢిల్లీ జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు లో కే ఎల్ రాహుల్ 77 పరుగులు, పోరెల్ 33 పరుగులు, స్టబ్స్ 24 పరుగులు, పటేల్ 21 పరుగులు, రిజ్వీ 20 చొప్పున పరుగులు చేసారు. చెన్నై జట్టు లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసారు. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఆరంభం లోనే అంటే పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. రచిన్ రవీంద్ర, కాన్వే, రుతురాజ్, దూబే, జడేజా తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. అత్యధికం గా విజయ్ శంకర్ 69 పరుగులు, ధోనీ 30 పరుగులు చేసారు. 20 ఓవర్ల లో 5 వికెట్లు కోల్పోయి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై జట్టు. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై 25 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. చేపాక్ స్టేడియం లో చెన్నై జట్టు పై ఢిల్లీ జట్టు 2010 లో విజయం సాధించింది. ఆ తర్వాత 15 ఏళ్ళకు నేడు మరలా విజయం సాధించింది. కే ఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచు కున్నారు. డైలీ ఐపీఎల్ అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
Match No-22, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్.. విజయ్ న్యూస్ కి స్వాగతం . ఏప్రిల్ 8, 2025 వ తేదీన జరిగిన ఐపీఎల్ పోటీలలో మ్యాచ్ నంబర్ 22 వివరాలు ఒకసారి చూద్దాం. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్ ప్లే లో అతి ముఖ్యమైన మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్. అంతే కాకుండా ఎనిమిది ఓవర్లలో 83 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగి ఆడాడు. చెన్నై బౌలర్లను చితక్కొట్టాడు. ఒకానొక దశలో ప్రియాన్ష్ ఆర్యకి బౌలింగ్ చేయాలంటేనే భయపడేంత గా పరుగులు రాబట్టాడు. పతిరణ బౌలింగ్ లో వరుస సిక్సర్ల తో వీర విహారం చేసాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య ఐపీఎల్ చరిత్ర లోనే అతి వేగం గా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చరిత్ర పుటలకు ఎక్కాడు. చివర్లో శశాంక్ సింగ్, జెన్ సన్ ధాటిగా ఆడటం తో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులోని ప్రధానమైన ఐదుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయినప్పటికీ ప్రియాన్స్ మెరుపు శతకం తో, శశాంక్ హాఫ్ సెంచరీ తో భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై ప్రారంభం లో ధాటి గానే ఆడింది. రచిన్ రవీంద్ర, రుతురాజ్ 62 పరుగుల వద్ద అవుట్ కావడం తో కష్టాల్లో పడిన చెన్నై జట్టును కాన్వే, శివం దూబే ఆదుకున్నారు. తన డౌన్ మార్చుకుని ఈ సారి ముందుగానే బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ మూడు భారీ సిక్సర్లు , ఒక బౌండరీ కొట్టి సీఎస్కే అభిమానులను అలరించారు. యష్ ఠాకూర్ బౌలింగ్ లో చాహల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ధోనీ. గత ఐపీఎల్ లో సీఎస్కే గెలిచే దశలో ధోనీ ని యష్ దయాళ్ అవుట్ చేస్తే ఈ సారి మంచి ఊపు మీద ఉన్న ధోనీ ని యష్ ఠాకూర్ అవుట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడా తో తమ హోం గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. మెరుపు సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యారు. మరిన్ని క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
Match No-24, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఏప్రిల్ 10, 2025 తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 24 విశేషాలు చూద్దాం. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ ఆరంభం లో అదరగొట్టి మూడు ఓవర్లలోనే అరవై పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి రనౌట్ అయిన తర్వాత ఆర్సీబీ మళ్ళీ కోలుకోలేక పోయింది. భారీ స్కోరు చేస్తుందనుకున్న బెంగళూరు జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ వైఫల్యం తో తక్కువ స్కోరు చేసింది. చివర్లో టిం డేవిడ్ 4 సిక్సర్లు కొట్టి 37 పరుగులు చేయడం తో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టం గా బౌలింగ్ చేసారు. తమ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోవడం తో ఆర్సీబీ గెలుపు సులభం అవుతుందని అనిపించింది. అంతే కాకుండా కేఎల్ రాహుల్ 5 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ని కెప్టెన్ పాటిదార్ వదిలి వేయడం తో మొత్తం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కెఎల్ రాహుల్ మరొక అవకాశం ఇవ్వకుండా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆరు భారీ సిక్సర్లు, ౭7 ఫోర్ల తో కేవలం 53 బంతుల్లో 93 పరుగులు చేసి ఢిల్లీ జట్టు ను గెలిపించాడు రాహుల్. నేను కూడా కర్నాటక వాడినే అనేటట్లు రాహుల్ చివర్లో ప్రదర్శించిన హావ భావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాహుల్ కు చివర్లో స్టబ్స్ కూడా జతకలవడం తో ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్స్ టేబుల్ లో రెండవ స్థానం లో కొనసాగుతోంది ఢిల్లీ జట్టు. ఆర్సీబీ మూడవ స్థానం లో ఉండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఎనిమిది పాయింట్ల తో మెరుగైన రన్ రేట్ తో మొదటి స్థానం లో కొనసాగుతోంది. ఐపీఎల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
Match No-34, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఏప్రిల్ 19 న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 34 విశేషాలు చూద్దాం. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. స్వంత గ్రౌండ్ లో ఆర్సీబీ ఓడిపోవడం ఇది మూడవసారి. వర్షం వలన ఆలస్యం గా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇరవై ఓవర్ల మ్యాచ్ ను పద్నాలుగు ఓవర్ల కు కుదించారు. బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఆరంభం లోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. కేవలం 33 పరుగులకు 5 వికెట్లు నష్టపోయిన దశ నుండి రజత్ పటిదార్, టిం డేవిడ్ ఆదుకోవడం తో గౌరవప్రదమైన స్కోరు చేసింది. ముఖ్యంగా టిం డేవిడ్ అసాధారణ ఆటను ప్రదర్శించి అర్థ సెంచరీ చేయడమే కాకుండా జట్టు స్కోరు 95 పరుగులకు చేర్చాడు. అర్షదీప్, జాన్సెన్, చాహల్, బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ మొదట్లో తడబడినా మెల్లగా నిలదొక్కుకొని విజయానికి అవసరమైన పరుగులు సాధించింది. వధేరా మూడు సిక్సర్లు, మూడు ఫోర్ల తో 33 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పన్నెండు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ ఈ పోటీలో విజయం సాధించింది. అతి తక్కువ స్కోరు కే ఆలౌట్ అయిపోతారనుకున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించడం లో కీలక పాత్ర పోషించిన టిం డేవిడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
Match No-36, TATAIPL 2025
హలో ఫ్రెండ్స్ . విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం . ఏప్రిల్ 19 వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నంబర్ Thirty Six విశేషాలు చూద్దాం. లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సవాయ్ మాన్ సింగ్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఆశక్తి రేపిన ఈ మ్యాచ్ లో విజయం కోసం రెండు జట్లూ చాలా కష్టపడ్డాయి. అనేక నాటకీయ మలుపుల తర్వాత విజయం లక్నో జట్టుని వరించింది. టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకొని ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. లక్నో జట్టులో మార్క్ రాం మూడు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 66 పరుగులు చేసారు. బదోని 50, సమద్ 30 పరుగులు చేసారు. తమ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం లో ధాటి గా ఆడింది. ఐపీఎల్ చరిత్ర లోనే అతి చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ తో ఆరంగేట్రం చేసారు. తాను ఎదుర్కొన్న మొదటి బంతిని అలాగే మూడవ బంతిని సిక్సర్లు కొట్టి తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనం గా ప్రారంభించాడు సూర్యవంశీ. మూడు భారీ సిక్సర్లు, రెండు బౌండరీలు కొట్టి ముప్పై నాలుగు పరుగులు చేసిన సూర్యవంశీని పంత్ రనౌట్ చేసాడు. అనవసరం గా ఫ్రంట్ పుట్ కి వచ్చి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఏడ్చుకుంటూ పెవిలియన్ వైపుకు సూర్య వంశీ వెళ్తున్న దృశ్యం అందరినీ కలచి వేసింది. జైస్వాల్ 74 పరుగులు, రియాన్ పరాగ్ 39 పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ కి ఓటమి తప్పలేదు. చివరి ఓవర్ లో 9 పరుగులు చేయవసిన రాజస్థాన్ కేవలం ఆరు పరుగులే చేయడం తో లక్నో జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్ బౌల్ చేసిన ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీయడం తో పాటు కేవలం ఆరు పరుగులే ఇవ్వడం తో రాజస్థాన్ మరొక పరాజయాన్ని మూటకట్టుకోక తప్పలేదు. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు