June 6, 2025

JEE Main 2025 Session-1 Results|ఆలిండియా టాపర్ తెలుగమ్మాయి | JEE మెయిన్స్ 2025 ఫలితాల విడుదల

JEE Main 2025 Session-1 Results

JEE Main 2025 Session-1 Results

JEE Main 2025 Session-1 Results | JEE మెయిన్స్ 2025 ఫలితాల విడుదల

JEE మెయిన్స్ 2025 సెషన్ -1 యొక్క ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – NTA ఈ ఫలితాలను తమ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ పరీక్ష కు చెందిన స్కోరు కార్డు కోసం NTA వెబ్ సైట్ ను సందర్శించ వచ్చు. jeemain.nta.nic.in వెబ్ సైట్ ను సందర్శించి స్కోరు కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.JEE Main 2025 Session-1 Results

ఈ విడత నిర్వహించిన పరీక్ష లో మొత్తం 14 మంది జాతీయ స్థాయి లో నూటికి నూరు పర్సంటైల్ సాధించడం విశేషం. ఈ 14 మందిలో గుజరాత్ కు చెందిన వారు ఐదురుగు. మహిళా అభ్యర్ధులలో టాపర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ నిలిచారు. తెలంగాణా కు చెందిన బని బ్రాతా మాజీ కూడా 100 పర్సెంటైల్ సాధించిన వారిలో ఒకరు. మొత్తం 12.58 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు అయ్యారు.  ఈ పరీక్ష కు హాజరైన మహిళా అభ్యర్ధుల సంఖ్య 4,24,810. ఈ పరీక్ష కు హాజరైన పురుష అభ్యర్దుల సంఖ్య 8,33,325. ఈ సంవత్సరం జనవరి 22 నుండి 29 వరకూ ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది JEE రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుండి 8 తేదీ వరకు జరుగుతాయి.

నూటికి నూరు పర్సెంటైల్ సాధించిన 14 మంది వివరాలు ఇవిగో 

  1. ఆయుష్ సింఘాల్
  2. కుశాగ్ర గుప్తా
  3. దక్ష్
  4. హర్ష ఝా
  5. రజిత్ గుప్తా
  6. శ్రేయాస్ లోహియా
  7. సాక్షం జిందాల్
  8. సౌరవ్
  9. విశాద్ జైన్
  10. అర్నవ్ సింగ్
  11. షివెన్ వికాస్ తోష్నీవాల్
  12. సాయి మనోజ్ఞ గుత్తికొండ (ఆంధ్రప్రదేశ్)
  13. ఓం ప్రకాష్ బెహరా
  14. బని బ్రాత మాజీ (తెలంగాణా)

సాయి మనోజ్ఞ గుత్తికొండ గుంటూరు అమ్మాయే 

దేశం లో JEE పరీక్షలలో 100 పర్సెంటైల్ సాధించిన 14 మందిలో సాయి మనోజ్ఞ ఒకరు. బాలికలలో మొదటి ర్యాంకును ఆమె సొంతం చేసుకున్నారు. సాయి మనోజ్ఞ గుంటూరు కు చెందిన అమ్మాయి. గుంటూరు లోని భాష్యం జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువు కున్నారు. ప్రణాళికా బద్దం గా చదవడం వల్లనే తాను ఈ రాంక్ సాధించ గలిగానని ఆమె చెప్పారు. ఈసీఈ బ్రాంచ్ లో ఏదైనా ఐఐటీ జాయిన్ అవుతానని ఆమె చెప్పారు.